తేది :22-03-2025 నెల్లూరు జిల్లా కోవూరు మండలం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఆగిపోయిన జీతాలు కార్మికులకు నేనున్నాను అండగా అంటున్న నెల్లూరు జిల్లా కోవూరు మండలం టీడీపీ శాసన సభ్యురాలు గౌరవనీయులైన శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు

0
29

తేది :22-03-2025 నెల్లూరు జిల్లా కోవూరు మండలం న్యూస్ : గతంలో నిలిపివేయబడిన ఆరు షుగర్ ఫ్యాక్టరీలు చిత్తూరు, కడప, తిరుపతి గాజులమన్యం, అనకాపల్లి, తెనాలి, నెల్లూరు జిల్లా కోవూరు మండలం నందు ఉన్న షుగర్ ఫ్యాక్టరీలకు గత Y S R C P ప్రభుత్వంలో 108 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.. దానిలో భాగంగా ఐదు ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులకు ఆగిపోయిన బకాయిలను అందించారు..

ఈరోజు అనగా 22-03-2025 శనివారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రస్తుత ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి తెలియజేస్తూ గత 13 సంవత్సరాల నుంచి మాకు రావలసిన బకాయిల కొరకు తిరుగుతూనే ఉన్నాము గత ప్రభుత్వంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకున్న వారే కాదు… అలాగే ఎంతోమంది ప్రజాప్రతినిధులతో మేము దీన్ని గురించి ప్రస్తావించాము కానీ పట్టించుకున్న నాధులే లేరు అని వారి వేదనను తెలియజేశారు.. వారి వేదనను తెలుసుకున్న కోవూరు నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యురాలు అయిన గౌరవనీయులైన శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు కార్మికులకు నేనున్నాను అండగా ఉంట్టాను అని వారికి భరోసాను ఇచ్చారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here